విధాత, హైదరాబాద్: తెలంగాణాలో పదో తరగతి ఫలితాలను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించింది. 30వ తేదీన ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ పదవ తరగతి ఫలితాల ప్రకటనకు సిద్ధం కావడంతో పరీక్షలు రాసిన సుమారు 5 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగగా.. ఏప్రిల్ 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ను ప్రారంభించారు.19 కేంద్రాల్లో ఈ నెల 13 వరకు స్పాట్ వాల్యూయేషన్ జరిగింది. ఈ నెల 30వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 30న పదవ తరగతి ఫలితాలు
తెలంగాణాలో పదో తరగతి ఫలితాలను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించింది

Latest News
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !