విధాత, హైదరాబాద్ : అనేక భద్రత ప్రమాణాలతో రూపొందించబడి..కేవలం గ్యాస్ కట్టర్లతో మాత్రమే ధ్వంసమయ్యే ఏటీఎంల సాంకేతికతకు తమ చోర కళతో సాధారణ యువకులు సవాల్ విసిరారు. ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఏటీఎంలో డబ్బులు చోరీ చేస్తున్న మైనర్ దొంగల నైపుణ్యం చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టిని పెట్టి ఫెవిక్విక్ తో అంటించి వెళ్లేవారు. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు. ఇలా వాళ్లు వెళ్లాక ఆ డబ్బులు తీసుకొని శుభం జల్సాలు చేసేవాడు. దీని గురించి అడిగి తెలుసుకున్న మరికొంత మంది మైనర్లు ఇలా ఏటీఎం చోరీలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఈ తరహా సంఘటనలపై బ్యాంకు అధికారులకు ఎక్కువ ఫిర్యాదులు రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు దొంగ శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నారు.
ATM Theft | ఏటీఎం సాంకేతికతకు దొంగల సవాల్ … ప్లాస్టిక్ పట్టిని పెట్టి ఏటీఎంలో డబ్బుల చోరీ
అనేక భద్రత ప్రమాణాలతో రూపొందించబడి..కేవలం గ్యాస్ కట్టర్లతో మాత్రమే ధ్వంసమయ్యే ఏటీఎంల సాంకేతికతకు తమ చోర కళతో సాధారణ యువకులు సవాల్ విసిరారు.

Latest News
వైద్యులు మరణించిందన్నారు… మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చింది!
మరో 4 రోజల్లో పాస్పోర్ట్ జారీలో మార్పులు
షాకింగ్.. పిల్లలు పరీక్ష రాస్తుంటే.. తల్లిదండ్రులు చిట్టీలు అందించారు
ఎగ్జిట్ పోల్స్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి!
రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు
ఆ రోడ్డుపై వాహనం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు.. ఎక్కడుందో తెలుసా..?
Excel sheet | క్లారిటీ అంటే ఇది భయ్యా.. తన పెళ్లి సంబంధాలపై ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసిన డేటా అనలిస్ట్
జూబ్లీహిల్స్లో రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్కు బిగ్ రిలీఫ్
12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,