Passport Seva | ఇంకో 4 రోజుల్లో పాస్‌పోర్ట్‌ జారీలో మార్పులు

దేశంలో పాస్‌పోర్టుల జారీలో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ భారత ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. సరళతర నిబంధనలు 2026, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి.

Simplified Digital system for Passports

Passport Seva | దేశంలో పాస్‌పోర్టుల జారీలో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ భారత ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. సరళతర నిబంధనలు 2026, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి. సవరించిన విధానంతో పేపర్ పని తగ్గుతుందని, డిజిటల్ వెరిఫికేషన్ మూలంగా పని సులువు కానున్నదని ప్రభుత్వం చెబుతున్నది. మోసాలను అరికట్టేందుకు, వేగవంతంగా సేవలు అందించేందుకు మార్పులు తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కొత్తగా దరఖాస్తు చేసేవారు, రెన్యువల్ చేసుకునేవారు తమ దరఖాస్తులు సమర్పించే ముందు వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్​ వల్ల పాస్​పోర్టుల సత్వర జారీకి అవకాశం కలుగుతుందని విదేశాంగ శాఖ భావిస్తోంది.

చిన్నారులు కూడా డిజిటల్ బర్త్ సర్టిఫికెట్లు, స్కూల్ గుర్తింపు కార్డులు జతపరిచి దరఖాస్తు చేస్తే సత్వరమే పాస్ పోర్టు జారీ చేయనున్నారు. సంరక్షకుల ఆమోద పత్రంలో కూడా సంస్కరణలు తీసుకువచ్చారు. పాస్ పోర్టు కేంద్రాలను చిన్న చిన్న నగరాలు, మండల కేంద్రాలకు విస్తరించనున్నారు. మారిన నిబంధనలు ఒకసారి పాస్ పోర్టు వెబ్ ఫోర్టల్ లో అధ్యయనం చేసి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలను కోరుతోంది.

Latest News