విధాత: సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ‘‘మోదీ వన్ నేషన్ వన్ సెన్సెస్ను ఎందుకు తీసురావడం లేదు? మోడీ ప్రభుత్వం కులగణన చేయకపోవడంలో మతలబు ఏంటి? కుల గణన చేస్తేనే రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరు’’ అని చెప్పారు.