విధాత,యాదాద్రి: కలెక్టర్ అనితరామచంద్రన్పై బదిలీ వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతిలో అలసత్వం చేసినందుకు బదిలీ జరిగినట్లు తెలిసింది. కాగా అనిత రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్గా పమేలా శత్పథి నియామకం అయ్యారు. కాగా అంతకముందు పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.