Site icon vidhaatha

ఇకనుంచీ గూగుల్​ పే, ఫోన్​పేలలో కూడా కరెంటు బిల్లులు చెల్లించొచ్చు

తెలంగాణ విద్యుత్​ ఉత్తర, దక్షిణ పంపిణీ సంస్థలు గత నెల ఆపేసిన యూపీఐ ఆధారిత బిల్లు చెల్లింపులను తిరిగి పునరుద్ధరించాయి. జులై ఒకటో తేదీ నుండి ఈ రెండు సంస్థలు యూపిఐ యాప్​లు, నెట్​ బ్యాంకింగ్, పేమెంట్​ గేట్​వేల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులను స్వీకరించడం ఆపేసాయి. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ చర్యను రెండు సంస్థలు అప్పుడు చేపట్టాయి.

తాజాగా నేషనల్​ పేమెంట్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా భారత్​ బిల్​ పే సిస్టమ్​​(NPCI BBPS) ఈ రెండు విద్యుత్​ పంపిణీ సంస్థలను తాము తమ చెల్లింపుల వ్యవస్థలో చేర్చుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సౌలభ్యంతో ఇప్పుడు కరెంటు బిల్లులు వందలాది బ్యాంకులు, ఆర్థిక సంస్థల యాప్​లు, వెబ్​సైట్ల ద్వారా చెల్లించవచ్చు. దీనిని ఇంకా సులభతరం చేయడానికి తాము పంపిణీ సంస్థలకు సహకరిస్తామని భారత్​ బిల్​ పే సిస్టమ్ స్పష్టం చేసింది.

దీంతో అమెజాన్​ పే, గూగుల్​ పే, ఫోన్​ పేల ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమమైంది.

 

 

 

 

 

Exit mobile version