సెప్టెంబర్ 12న పరీక్ష
విధాత: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 1న పరీక్ష జరుగాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. నీట్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులే మాస్కులు అందజేస్తారని తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్టు పేర్కొన్నారు. అలాగే 3,862గా ఉన్న పరీక్ష కేంద్రాలను కూడా పెంచనున్నట్టు ప్రకటించారు. తెలుగు సహా 11 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. గతేడాది నీట్ పరీక్షను సెప్టెంబరు 13న నిర్వహించారు. 13.66 లక్షల మంది పరీక్ష రాశారు. ఎంబీబీఎస్కు 7,71,500 మంది అర్హత సాధించారు.
నేటి నుంచి నీట్ దరఖాస్తులు
<p>సెప్టెంబర్ 12న పరీక్షవిధాత: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 1న పరీక్ష జరుగాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. నీట్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులే మాస్కులు అందజేస్తారని […]</p>
Latest News

పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజనీరింగ్ లో పాలు- భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వివరించిన సెంటర్ ఫర్ లిబర్టీ
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై లవ్ సాంగ్
ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!
కేటీఆర్ మూటల మాటలకు బల్మూరి, చామల కౌంటర్
‘ఉస్తాద్ భగత్సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ..
దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !
‘రణబాలి’ స్టోరీ ఇదేనా..
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు
కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్