విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని వారి నుంచి దరఖాస్తులు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 6 సాయంత్రం 5 గంటల వరకు సాధారణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని 7 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అదనంగా రూ.1000 ఆలస్య ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. సుమారు 50 వేల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.
ఆర్జీయూకేటీ సెట్కు 21,500 దరఖాస్తులు
<p>విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని […]</p>
Latest News

‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!