రేపు కాంగ్రెస్ ఎంపీల‌తో సోనియాగాంధీ స‌మావేశం

విధాత‌(న్యూఢిల్లీ): కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ రేపు త‌మ‌ పార్టీ లోక్‌స‌భ స‌భ్యుల‌తో స‌మావేశం కానున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో ప్ర‌స్తుతం దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై చ‌ర్చించ‌నున్నారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వైఫ‌ల్యాలు, ప్ర‌ధాన ప్రతిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రి, స్పందించాల్సిన తీరు త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని […]

  • Publish Date - May 6, 2021 / 07:04 AM IST

విధాత‌(న్యూఢిల్లీ): కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ రేపు త‌మ‌ పార్టీ లోక్‌స‌భ స‌భ్యుల‌తో స‌మావేశం కానున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో ప్ర‌స్తుతం దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై చ‌ర్చించ‌నున్నారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వైఫ‌ల్యాలు, ప్ర‌ధాన ప్రతిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రి, స్పందించాల్సిన తీరు త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

Latest News