విధాత: తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యం వల్ల ప్రయాణికులకు రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్ శని,ఆదివారం మూడు ట్రిప్పుల్లో రెండున్నర గంటలు ఆలస్యమైంది. ఈ కారణంగా ఐఆర్సీటీసీ మొదటిసారి గరిష్టంగా 2035 మంది ప్రయాణికులకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.