విధాత, హైదరాబాద్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజు తన చాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పోటీకి దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో వైసీపీ నుంచి బొత్స మాత్రమే బరిలో ఉండడంతో… ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఎమ్మెల్సీ బొత్సకు అభినందనలు తెలిపారు. ప్రమాణానికి ముందు జగన్ను క్యాంపు కార్యాలయంలో బొత్స మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్. మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, తీసుకొచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి. కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Botsa Satyanarayana | ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ప్రమాణ స్వీకారం
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజు తన చాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు.

Latest News
Antharaganga Waterfall | హైదరాబాద్కు కూతవేటు దూరంలో ‘అంతరగంగ’ జలపాతం
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !