విధాత: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్ర హోమం, మధ్యాహ్న ఆరాధన, బరిహరణ, శాత్తుమొర చేపట్టారు. ఈ సందర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్ వెంకటేష్, కంకణభట్టార్ రాజేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
<p>విధాత: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్ర హోమం, మధ్యాహ్న ఆరాధన, బరిహరణ, శాత్తుమొర చేపట్టారు. ఈ సందర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం […]</p>
Latest News

అత్త గదిలోకి తొంగిచూడగా.. ఉలిక్కిపడ్డ కోడలు పిల్ల
విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక..
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం
వీగిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు.. కుప్పకూలిన కుట్ర
మనీ ప్లాంట్ ఆ దిశలో వేలాడుతుందా..? అయితే ఆర్థిక నష్టాలే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు..!
తెలంగాణ సర్కారు కుల సర్వేలో ‘విశ్వకర్మ’ల విచిత్ర పరిస్థితి
టార్గెట్ రేవంత్రెడ్డి.. పొలిటికల్ గేమ్ చేంజర్గా జగిత్యాల బీఆరెస్ సభ?
ఆపిల్ చరిత్రలోనే 2026 అతి పెద్ద లాంచింగ్ సంవత్సరం : ఏకంగా 15కు పైగా డివైజ్లు
మీరేం తినాలో కూడా రోబోలే చెప్పేస్తాయి.. చైనాలో వైరల్గా ఏఐ వెయిటర్లు!