విధాత: ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల తీరు ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో గణేష్.. ‘‘ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో గంజాయి సాగు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కిదారి ఘటన వెనుక దుంబ్రి గూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడానికి ఇదే కారణం. గంజాయి సాగు విషయంలో సీఐ, సీఐల నుంచి పై అధికారుల వరకూ బాగుపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఉద్దేశంతో పరివర్తన పేరిట ఆదివాసి గ్రామాలపై పోలీసుల దాడులను ప్రజలంతా తిప్పికొట్టాలి’’ అని పేర్కొన్నారు.
పోలీసులకు ఏవోబీ కార్యదర్శి గణేష్ లేఖ
<p>విధాత: ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల తీరు ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో గణేష్.. ‘‘ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ […]</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !