విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె తొలుతగా ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 98%స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మహిళా సాధికారత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇవే అంశాల ప్రధాన అజెండాతో రాష్ర్ట వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలవారీగా వివిధరంగాల మేధావులతో చర్చాగోష్టులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా మహిళా కమిషన్ చేపట్టిన ‘ఈ-నారీ’ వెబినార్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా ‘దిశ’ చట్టం అమలుపై మాట్లాడుతూ ఇటీవల పార్లమెంటరీ కమిటీ విశాఖ పర్యటనలో భాగంగా ‘దిశ’ పోలీసు స్టేషన్ల పనితీరును మెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని గుర్తించడం శుభపరిణామమన్నారు. మహిళల భద్రత, రక్షణకు పనిచేసే ప్రభుత్వాలకు మహిళా కమిషన్ తోడ్పాటు ఉంటుందన్నారు.
సీఎంను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
<p>విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె తొలుతగా ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 98%స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మహిళా సాధికారత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇవే అంశాల ప్రధాన అజెండాతో రాష్ర్ట […]</p>
Latest News

శ్రీరాముడిపై వ్యాఖ్యలు..ప్రకాశ్రాజ్ వివరణ !
గుడ్ న్యూస్..హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో ఫ్రీ జర్నీ!
ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ..
అక్షయ తృతీయ బంగారం సేల్స్ పెరిగేనా..?
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ జంట
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. రోజుకు 338 పదాలను తగ్గించేశాం.. ఆందోళన రేకెత్తిస్తున్న అధ్యయనం!
ప్రభుత్వ మీటింగ్ మధ్యలో అనుకోని అతిథి.. కలెక్టర్ కుర్చీలో కూర్చొని కోతి హంగామా!
రాశీ ఖన్నా కారవాన్లో చోరీ
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..
నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్కామ్ ద్వారా భర్తీ