విధాత,విజయవాడ : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు చాలా మందిని కోల్పోయాను.
విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన తరఫున నివాళులు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడింది. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి ఇచ్చా. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు’’ అని పవన్ అన్నారు.
ప్రజల కన్నీళ్లు తుడుస్తాం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
<p>విధాత,విజయవాడ : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది […]</p>
Latest News

2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మరి మీ రాశి ఉందా..?
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగాలున్నాయి..!
వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్
వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు: మంత్రి కోమటిరెడ్డి
సర్పంచ్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ అభినందనలు
విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్