సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల కొద్ది వార్తలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం తెలియక చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. అయితే సౌందర్యతో జగపతిబాబు ఎఫైర్ నడిపాడనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. ఎట్టకేలకి దీనిపై సీనియర్ నటి ఆయని ఓ క్లారిటీ ఇచ్చింది. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య తెలుగు వాళ్లకి ఎంత దగ్గరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కింటి అమ్మాయిగా కనిపించే సౌందర్య తన నటనతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అప్పట్లో సౌందర్య స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు జగపతిబాబు, శ్రీకాంత్ వంటి టైర్ టు హీరోలతో కూడా పని చేసింది
జగపతి బాబు, సౌందర్య కాంబోలో చిలకపచ్చ కాపురం, భలే బుల్లోడు, దొంగాట, ప్రియ రాగాలు, అంతఃపురం.. ఇలా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో చాలా మంది వారిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారాలు చేశారు.అయితే అప్పటికే జగపతి బాబుకు పెళ్లి కావడం, ఇద్దరు పిల్లకు కూడా ఉన్నారు. అయిన వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని, పెళ్లి కూడా చేసుకుంటారంటూ జోరుగా ప్రచారాలు చేశారు. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతున్న నేపథ్యంలో సౌందర్య క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆమని దానిపై క్లారిటీ ఇచ్చింది.
జగపతి బాబు, సౌందర్య మధ్య అలాంటి బంధమేమీ లేదని.. కాకపోతే ఎక్కువ సినిమాలు కలిసి చేయడం వల్ల అలాంటి వార్తలు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. తను చాలా మంచిది. అన్నయ్య మాట ఎక్కువగా వినేది. అన్నయ్య చెప్పాడనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె మరణం చాలా బాధని కలిగించిందని ఆమని పేర్కొంది. హీరోయిన్లు సౌందర్య, ఆమని ఇద్దరూ కర్నాటకకు చెందిన వాళ్లే కాగా, వారు ఇద్దరూ బెంగళూరు నుంచే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రావడంతో ఇద్దరి మధ్య మంయి స్నేహం కుదిరింది. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం వల్లే ఈ ఇద్దరూ ఇగోలను పక్కన పెట్టేసి చాలా సఖ్యతగా ఉండేవాళ్లు.