Goods Train Derailed | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారు జామున 3.35 గంట సమయంలో పట్టాలు తప్పింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం – విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ను రెండుమార్గాల్లో బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది. విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ రైలు 8.45 గంటలకు బయలుదేరి వెళ్లింది. విశాఖపట్నంతో పాటు దువ్వాడ రైల్వేస్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Goods Train Derailed | ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్న వందే భారత్ రైలు..
<p>Goods Train Derailed | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారు జామున 3.35 గంట సమయంలో పట్టాలు తప్పింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం - విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం - […]</p>
Latest News

పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు