విధాత : పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ కెమికల్స్ ఇండస్ట్రీలో రియాక్టర్ పేలిన ఘటనలో 8మంది కార్మికులు మృతి చెందారు. ఆరుగురు సంఘటన స్థలంలోనే చనిపోగా.. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో మరో 26మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 150 కార్మికులు ఉండగా.. పేలుడు జరిగిన 90 మంది ఉన్నారని ఐజీ సత్యనారాయణ కథనం. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాద నివారణ బృందాలు రెండు ఫైరింజన్లతోచ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. కంపెనీ షెడ్డు కుప్పకూలింది. షెడ్డు కింద ఇంకా ఎవరైనా ఉన్నారా లేదో చూసేందుకు శిధిలాలలను తొలగించారు. క్షతగాత్రులను ఇస్నాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.. మంటలు ఎగిసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఫ్యాక్టరీలోకి అప్పుడప్పుడే కార్మికులు విధుల్లోకి వస్తున్నందునా మరింత మంది కార్మికులకు ప్రమాదం తప్పినట్లయ్యింది. రియాల్టర్ పేలుడుతో ఎగిసిపడుతున్న కెమికల్ పొగల వాసనతో స్థానిక ప్రజలు ఇబ్బందిపడ్డారు.
Reactor Explodes| పటాన్చెరులో సిగాచీ కెమికల్స్ ఇండస్ట్రీలో పేలిన రియాక్టర్..8మంది మృతి
విధాత : పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ కెమికల్స్ ఇండస్ట్రీలో రియాక్టర్ పేలిన ఘటనలో 8మంది కార్మికులు మృతి చెందారు. ఆరుగురు సంఘటన స్థలంలోనే చనిపోగా.. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో మరో 26మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 150 కార్మికులు ఉండగా.. పేలుడు జరిగిన 90 మంది ఉన్నారని ఐజీ సత్యనారాయణ […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు