పటాన్ చెరు ప్రాంతంలో మంజీరా ఫేజ్-1 కోసం చేపట్టిన పనుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ టౌన్షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్చెరు ఇండస్ట్రీయల్ ఏరియా, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్పేట్, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్తో పాటు సమీప ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతాల ప్రజలు నీటి సరఫరా నిలిపివేతను దృష్టిలో ఉంచుకోని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జలమండలి అధికారులకు సహకరించాలని కోరారు.