విధాత, హైదరాబాద్ : గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపుల వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులను పలు మార్లు హెచ్చరించినా వారి వైఖరి మార్చుకోవడం లేదని, బాధిత మహిళా ప్రొఫెసర్ కన్నీటి పర్యంతమై తన సమస్యను యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే యాజమాన్యం, ప్రిన్సిపాల్ నరసింహులు ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటూ తేలికగా కొట్టిపారేశారు. దీంతో మహిళా ప్రొఫెసర్ కు న్యాయం చేయాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ చాంబర్లో అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతుండగా బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్పై నుంచి దాటి ప్రిన్సిపాల్ బయటికి వెళ్లిపోయిన తీరు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టింది. ఈ సమస్యపై యాజమాన్యం స్పందించే వరకు ఆందోళన విరమించే లేదని ఉద్యోగులు భీష్మించారు.
సీబీఐటీలో ఉద్యోగుల ఆందోళన … లైంగిక వేధింపులపై నిరసన
గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపుల వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులను పలు మార్లు హెచ్చరించినా వారి వైఖరి మార్చుకోవడం లేదని, బాధిత మహిళా ప్రొఫెసర్ కన్నీటి పర్యంతమై తన సమస్యను యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

Latest News
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం