విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల సహా 58మంది పోటీలో మిగిలారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 23మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు కాసేపట్లో ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించనున్నారు. ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీ బాధిత రైతులు, గ్రూప్ 1 అభ్యర్థులు, మాల మహానాడు సహా పలువురు స్వతంత్రులు సహా ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 211మంది 321 నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ పిదప రంగంలో ఉన్న 81మంది అభ్యర్థులలో 23మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిలు బరిలో ఉన్నారు. నవంబర్ 11 న పోలింగ్, నవంబర్ 14 న కౌంటింగ్ జరుగనుంది. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
Jubilee Hills By-Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58మంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 58 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 23 మంది ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పోలింగ్ నవంబర్ 11న కౌంటింగ్ 14న జరుగుతుంది.

Latest News
మార్కెట్లోకి మళ్లీ రెనో డస్టర్ : ఆకర్షణీయమైన రూపం – అద్భుత భద్రత
బీజేపీకి ఆరూరి రాజీనామా.. తిరిగి బీఆరెస్లోకి..
కదిలే 'దుర్భేద్య దుర్గం'… మోదీ ప్రయాణించే కారు ప్రత్యేకతలివే.!
మేడారం గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు
చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా
రెనాల్ట్ డస్టర్ ఈజ్ బ్యాక్ .. లుక్, ఫీచర్స్ అదుర్స్
తెలంగాణలో అధికార పక్షానికి మున్సి‘పోల్’ పరీక్ష
మన రక్తంలోని ఇనుము ఒకప్పుడు నక్షత్రంలో పుట్టిందా? శాస్త్రవేత్తలు చెబుతున్న అద్భుత నిజం..
నిత్యం కత్తులు దూసే రెండు సంస్థలు.. ఇంటి వసతి కోసం చేతులు కలిపాయి!