విధాత:
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండ రామ్, శ్రీపాల్ రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించారు. సంవత్సరం న్నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప రావలసిన జీపీఎఫ్, జీఎల్ఐఎస్సీ, జీఐఎస్, లీవ్ ఇన్ క్యాస్మెంట్ మ్యుటేసన్, గ్రాట్యుటీ ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని అన్నారు. కొంతమంది మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.మనో వేదన అర్థం చేసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు ఇప్పించాలని కోరారు. ఆత్మ గౌరవంతో జీవించేలా సహకరించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర, మహబూబ్ అలీ తదితరులు ఉన్నారు.
retired employees | రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించండి..కోదండరామ్, నరేందర్ రెడ్డిలకు వినతి
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది.

Latest News
గుడ్న్యూస్: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు చిరుజల్లులు
కాంగ్రెస్ను వీడి కారెక్కనున్న జగిత్యాల జీవన్రెడ్డి?
నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య
5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం
వైరల్ అవ్వాలని రీల్.. యువతికి కోతి ఇచ్చిన షాక్ చూడండి!
వాట్సాప్లో భారీ అప్డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!
జనపథంలో పీపుల్స్ మార్చ్.. ప్రజాపాలనలో భట్టి అడుగుజాడలు..!
ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల
లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొత్త జీవితం..
ఆ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం