విధాత:
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండ రామ్, శ్రీపాల్ రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించారు. సంవత్సరం న్నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప రావలసిన జీపీఎఫ్, జీఎల్ఐఎస్సీ, జీఐఎస్, లీవ్ ఇన్ క్యాస్మెంట్ మ్యుటేసన్, గ్రాట్యుటీ ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని అన్నారు. కొంతమంది మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.మనో వేదన అర్థం చేసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు ఇప్పించాలని కోరారు. ఆత్మ గౌరవంతో జీవించేలా సహకరించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర, మహబూబ్ అలీ తదితరులు ఉన్నారు.
retired employees | రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించండి..కోదండరామ్, నరేందర్ రెడ్డిలకు వినతి
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది.

Latest News
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత ర్యాంకు.. 180 దేశాల జాబితాలో 157 స్థానంలో
మంగ్లీ కేసులో కీలక మలుపు !
దేశంలోనే అధికంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి
పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే
వేయి స్తంభాల గుడిలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా!
ఈ-సిగరెట్ ఎఫెక్ట్...రియాన్ పరాగ్ కు శిక్ష ఖరారు
పెళ్లైన కూడా అలాంటి పనులు చేయడమేంటో..
వీడెక్కడి బౌలర్..ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ లుక్కెయ్యండి !
ప్రభుత్వ సలహాదారులుగా వీహెచ్, శివధర్రెడ్డి
కవిత పార్టీ టీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్సిగ్నల్!