విధాత: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) పనుల పురోగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం పరిశీలించారు. ముందుగా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
అనంతరం యూనిట్ రెండులో 12 ఫ్లోర్లో పనులను పరిశీలించారు. కేసీఆర్ నాలుగు గంటల పాటు ప్లాంట్ లోని ముఖ్య ప్రాంతాల్లో తిరిగి ప్లాంట్ పనుల పురోగతి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ 450 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న బాయిలర్ను లిఫ్టులో వెళ్లి పరిశీలించారు. ఫ్లాంట్ పై ఎన్జీటీ ఇచ్చిన సూచనలపై అధికారులతో చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారుల కేసీఆర్ వివరించారు
2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ. 30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.
ముఖ్యమంత్రితో పాటు
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, జెన్.కో.సి.యం.డి ప్రభాకర్ రావు, నల్గొండ జడ్.పి. చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,
యాదాద్రి భువనగిరి జడ్పీ. చైర్మన్ సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి. కోటి రెడ్డి, శాసన సభ్యులు ఎన్.భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానం పూడి, గాదరి కిషోర్,శానంపూడి సైది రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, తదితరులు ఉన్నారు.