కరీంనగర్‌కు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తరలింపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు

  • Publish Date - April 21, 2024 / 12:45 PM IST

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయనే చెల్లించాల్సి ఉంటుంది. మానవత దృక్పథంతో కోర్టు రాధాకిషన్‌రావుకు ఈ వెసులుబాటు కల్పించింది.

Latest News