Telangana |
విధాత: తెలంగాణ కేబినెట్ విస్తరణ నేడు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగనుంది. గవర్నర్ తమిళి సై కేబినెట్ విస్తరణ కు సమయం ఇస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించారు.
సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.
గవర్నర్ తమిళి సై ఆయనతో పదవీ ప్రమాణా స్వీకారం చేయిస్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను కూడా కేబినెట్లోకి తీసుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.