Site icon vidhaatha

‘న‌మ‌శ్శివాయ’ పంచాక్ష‌రీ స్తోత్రం నిత్యం ప‌ఠిస్తే!

విధాత‌: న‌మశ్శివాయ అని స్మ‌రిస్తే చాలు నేనున్నాను అంటూ వ‌రాల వ‌ర్షం కురిపిస్తాడు ఆ బోళాశంకురుడు. ఆయ‌న స‌న్నిధిలో పంచాక్ష‌రి మంత్రం ప‌ఠిస్తే పొంగిపోతాడు. అంత‌టి మ‌హిమాన్విత‌మైన‌ది పంచాక్ష‌రీ మంత్రం. ఆ మంత్రంలోని ప్ర‌తీ అక్ష‌రం మ‌హాదేవుడి రూపాన్ని, ఆహార్యాన్ని దృశ్య రూపం గావించి శివ భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్దుల్ని చేస్తుంది.

నాగేంద్ర‌హారాయ త్రిలోచ‌నాయ
భ‌స్మాంగ రాగాయ మ‌హేశ్వ‌రాయ‌
నిత్యాయ శుద్దాయ దిగంబ‌రాయ‌
త‌స్మై ‘న’ కారాయ న‌మ‌శ్శివాయ‌

మందాకిని స‌లిల చంద‌న చ‌ర్చితాయ‌
నందీశ్వ‌ర ప్ర‌మ‌ధ‌ నాథా మ‌హేశ్వ‌రాయ‌
మందార ముఖ్య బ‌హుపుష్ప సుపూజితాయ‌
త‌స్మై ‘మ’ కారాయ న‌మ‌శ్శివాయ‌

శివాయ గౌరీ వ‌ద‌నార‌వింద
సూర్యాయ ద‌క్షాధ్వ‌ర నాశ‌కాయ‌
శ్రీ నీల‌కంఠాయ వృష‌ద్వ‌జాయ‌
త‌స్మై ‘శి’ కారాయ న‌మ‌శ్శివాయ‌

వ‌శిష్ట కుంభోద్భ‌వ గౌత‌మాది
మునీంద్ర దేవార్చిత శేఖ‌రాయ‌
చంద్రార్క వైశ్వాన‌ర లో చ‌నాయ‌
త‌స్మై ‘వ’ కారాయ న‌మ‌శ్శివాయ‌

య‌క్ష‌స్వ‌రూపాయ జ‌టాధ‌రాయ‌
పినాక హ‌స్తాయ స‌నాత‌నాయ‌
దివ్యాయ దేవాయ దిగంబ‌రాయ‌
త‌స్మై ‘య‌’ కారాయ న‌మ‌శ్శివాయ‌

పంచాక్ష‌ర‌మిదం పుణ్యం యః ప‌ఠేచ్ఛివ స‌న్నిధౌ
శివ‌లోక‌మ‌వాప్నోతి శివేన స‌హ మోద‌తే

Exit mobile version