Kondagattu | జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం కార్యనిర్వహన అధికారి టంకశాల వెంకటేశ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆలయ సిబ్బంది అవినీతిపై నిర్లక్ష్యం వహించినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. కొండగట్టు ఆలయంలో ఉద్యోగులు రూ.60లక్షల వరకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దుకాణాల లీజు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల దేవాదాయశాఖ అధికారులు సైతం కొండగట్టులో విచారణ చేపట్టారు. రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సరిగా లేకపోవడం, విధుల్లో అలసత్వం ప్రదర్శనకు పర్యవేక్షికుడితోపాటు సీనియర్ అసిస్టెంట్కు ఈవో టంకశాల వెంకటేశం మెమోలు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణను ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాలకు సిబ్బంది పాల్పడుతున్నా స్పందించడం లేదని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Kondagattu | కొండగట్టు ఆలయ ఈవో సస్పెన్షన్
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం కార్యనిర్వహన అధికారి టంకశాల వెంకటేశ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది
Latest News

‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !