Manipur Incident
విధాత: మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు, అత్యాచారం ఘటన వీడియోపై సీబీఐ విచారణను సీబీఐకి అప్పగిస్తు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన మేలో జరుగగా, ఇటీవల బయటకు వచ్చిన వీడియో వెలుగులోకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
మణిపూర్ హింసపై, మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ప్రకటన కోసం పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం.