BRS |
పువ్వాడతో రాయ బేరాలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలకు గాలం
విధాత: సీఎం కేసీఆర్ ను సవాల్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా ఆపరేషన్ గులాబీ జోరందుకుంది. ఖమ్మంతో పాటు రాష్ట్రంలోనూ బీఅరెస్ ను గెలవనివ్వనంటూ సవాల్ చేసిన పొంగులేటిని రాజకీయంగా మట్టి కరిపించేందుకు కేసిఆర్ సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారని ఖమ్మం గులాబీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన ఆయన అనుచరుడు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలను తిరిగి కారెక్కించి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పువ్వాడ గప్ చుప్ గా వెంకట్రావు, కనకయ్యలను వెంటబెట్టుకొని సీఎం కేసీఆర్ ను, హరీశ్రావును కలిసి మంతనాలు చేసినట్లుగా తెలుస్తుంది.
మొత్తం మీద తనను సవాల్ చేసిన పొంగులేటిని రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఖమ్మం రాజకీయాలపై సీరియస్ గానే దృష్టి పెట్టారు. మూడోసారి అధికారంలో రావడానికి ఖమ్మంలో సగం స్థానాలైనా దక్కించుకోవాల్సిన అవసరాన్ని కూడా కేసీఆర్ గుర్తించారు.
అటు తనను లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ కదుపుతున్న రాజకీయపావులను పొంగులేటి ఏ విధంగా ఎదుర్కొంటారు.. తన అనుచరులు చేజారిపోకుండా ఏం చేస్తారన్నది ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
పొంగులేటి షాక్ .. కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావు
చక్రం తిప్పిన మంత్రి హరీష్ రావు.
ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్లో చేరబోతున్నాడు.భద్రాచలం టికెట్… pic.twitter.com/sg22En06gN
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2023