ప్రారంభమైన సింగరేణి ఎన్నికలు

సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ మొదలైంది. 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది

  • Publish Date - December 27, 2023 / 05:13 AM IST

విధాత : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ మొదలైంది. 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు పర్యవేక్షణలోపోలింగ్ సాగుతుంది.


ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగ‌నుంది. సింగ‌రేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39, 775 మంది కార్మికులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటారు. ఎన్నికల్లో ప్రధానంగా 13 కార్మిక సంఘాలు పోటీపడుతున్నాయి. సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ ,కాంగ్రెస్ అనుబంధ ఐఎన్ టీయుసి, బిఆర్ఎస్ అనుబంధ టీబీజీకే ఎస్ ల మధ్య ప్రధాన పోటీ సాగుతుంది. ఇదే రోజు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు.


రామగుండం ఏరియాలోని ఆర్జీ-1లో 5404, ఆర్జీ-2లో 3557, ఆర్జీ-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.

6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పోరేట్‌ లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం-1 లో 5,404 మంది, రామగుండం-2 లో 3,557 మంది, రామగుండం-3 లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది ఓటు వినియోగించు కుంటున్నారు.


బెల్లంపల్లి లో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, శ్రీరాంపూర్‌ లో 9,149 మంది మొత్తంగా 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు.