హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ పేరిట తీసుకు వచ్చిన తొమ్మిది శ్లాబుల అంశంపై ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సరళమైన, సమర్థవంతమైన జీఎస్టీకి బదులు ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిది వేర్వేరు శ్లాబుల ద్వారా గబ్బర్ సింగ్ పన్ను విధించిందని విమర్శించారు. ఎనిమిది ఏళ్లలో ప్రజల నుంచి రూ.55 లక్షల కోట్లకు పైగా వసూలు చేసిందని మండిపడ్డారు. ప్రజలపై ఆర్థికంగా తీవ్ర భారం పడ్డ తర్వాత ప్రధాని మోదీ పొదుపు పండగ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ తీరు వంద ఎలుకలు తిన్న తర్వాత పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
జీఎస్టీ కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్: ఖర్గే
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ పేరిట తీసుకు వచ్చిన తొమ్మిది శ్లాబుల అంశంపై ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.

Latest News
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ సంచలనం.. 574/6తో లిస్ట్-A ప్రపంచ రికార్డు
ఇండిగో దెబ్బతో 3 కొత్త ఏయిర్ లైన్స్ కు అనుమతి
ఆటలంత హాయిగా చదువు నేర్పిన టీచర్.. నెటిజన్లు ఫిదా!
మిస్టికల్ కాశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్.. 35550 మాత్రమే
చిన్న పంచాయతీలకు 5 లక్షలు.. మేజర్ పంచాయతీలకు 10 లక్షల ఎస్డీఎఫ్ నిధులు : సీఎం రేవంత్రెడ్డి
బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం : సీఎం రేవంత్
కాలుష్యంలో హైదరాబాద్.. మరో ఢిల్లీ అవుతుందా? సిటీ అంతటా ‘అనారోగ్యకర’ గాలి!
వామ్మో.. మహబూబ్నగర్ డీటీసీకి ఇన్ని ఆస్తులా.! షాక్లో ఏసీబీ
సివిల్ వివాదాల్లో తలదూర్చకండి : డీజీపీ శివధర్ రెడ్డి
సమన్వయంతో పనిచేస్తే మేడారం జాతర సక్సెస్ : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్