Site icon vidhaatha

ఖర్గే సభను విజయవంతం చేయాలి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పీసీసీ బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది హాజరువుతారని తెలిపారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలన కు వ్యతిరేకంగా ఖర్గే ప్రసంగిస్తారని.. స్థానిక ఎన్నికలు సహా పార్టీ విస్తరణకు కేడర్ కు మార్గదర్శకం చేస్తారన్నారు. నిన్న నిజామాబాద్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు లేవని..వారంతా లొంగిపోవాలన్నారని.. మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మద్యలో ఆపేసారని..మన పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి ఎందుకు చర్చలు జరపరని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎల్బిస్టేడియం పరిశీలిలనో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వీహెచ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషిలు ఉన్నారు.

Exit mobile version