పాట్నా: తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీనిపై ఎక్స్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక వీడియో విడుదల చేస్తూ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘బీహార్లో 9 రోజుల వ్యవధిలో ఐదో వంతెన కూలిపోయింది. భూతాహి నదిపై మధుబని, సుపౌల్ మధ్య నిర్మాణలో ఉన్న వంతెన కూలింది. మీకు తెలుసా? తెలుసుకునేందుకు ప్రయత్నించండి.. అంటూ #Bihar #Bridge అనే హ్యాష్ట్యాగ్స్ పెట్టారు. ఈ వంతెన కూలిన ప్రాంతం నేపాల్కు సరిహద్దులో ఉన్నది. దాదాపు రెండేళ్లుగా ఈ వంతెన నిర్మాణంలో ఉన్నదని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఈ బ్రిడ్జ్ పిల్లర్ ఒకటి కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. నేపాల్లోని పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో భూతాహి నది పొంగిపొర్లుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్ని 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వంతెన కూలిపోవడంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టర్కే మరమ్మతు బాధ్యత అప్పగించారు.గతవారం అరారియా, సివాన్, తూర్పు చంపారన్ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. గురువారం కూడా కిషన్గంజ్ ఏరియాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది.
9 రోజుల వ్యవధిలోనే బీహార్లో కూలిన మరో వంతెన
తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు

Latest News
పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు!
తహశీల్ధార్ సుచరిత నివాసంలో భారీగా అక్రమాస్తులు!
నాగపూర్–హైదరాబాద్ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్ప్రెస్వే
నల్లగొండలో నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..!
వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం
గూగుల్లో సెర్చింగ్.. కేఫ్లో ప్లానింగ్.. కేతన్ హత్య కేసులో విస్తుబోయే వాస్తవాలు..
16.85లక్షల ఎకరాలలో భూమాతను కాల్చేశారు..!
కావేరి నదిలో విషాదం..నలుగురు మృతి
సముద్రపు అలలతో ఆట…ముగింపు విషాదకరం
బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్