ముంబై: మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు. రోడ్డు రవాణా, హైవేల శాఖ వాహన్ డాటా ప్రకారం.. 2024 జూన్లో ఈవీల అమ్మకాలు 14శాతం తగ్గి 1,06,081 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024, మే నెలలో 1,23,704 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ ఏడాది అమ్మకాల్లో ఇదే కనిష్ఠం.
అయితే.. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 8,39,545 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోయాయి. మొత్తం అమ్ముడైన వాహనాల్లో ఇవి 6.69 శాతం. గత ఏడాది ఎలక్ట్రిక్ టూ వీలర్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించడంతో అమ్మకాలు బాగా తగ్గాయి. 2024లో ఇప్పటి వరకూ అమ్ముడైన ఈవీల్లో 57శాతం టూవీలర్లే కావడం విశేషం. మొత్తం 8,39,545 యూనిట్లు అమ్ముడయ్యాయి.
జూన్లో తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు.

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు