ముంబై: మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు. రోడ్డు రవాణా, హైవేల శాఖ వాహన్ డాటా ప్రకారం.. 2024 జూన్లో ఈవీల అమ్మకాలు 14శాతం తగ్గి 1,06,081 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024, మే నెలలో 1,23,704 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ ఏడాది అమ్మకాల్లో ఇదే కనిష్ఠం.
అయితే.. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 8,39,545 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోయాయి. మొత్తం అమ్ముడైన వాహనాల్లో ఇవి 6.69 శాతం. గత ఏడాది ఎలక్ట్రిక్ టూ వీలర్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించడంతో అమ్మకాలు బాగా తగ్గాయి. 2024లో ఇప్పటి వరకూ అమ్ముడైన ఈవీల్లో 57శాతం టూవీలర్లే కావడం విశేషం. మొత్తం 8,39,545 యూనిట్లు అమ్ముడయ్యాయి.
జూన్లో తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు.

Latest News
మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
ఏం మేకోవర్ భయ్యా.. కలర్ఫుల్ శారీలో మృణాల్ అందాలు
హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన నిధి.. థండర్ థైస్ షో
అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
హెలికాప్టర్ పెయింటింగ్తో.. ఇజ్రాయెల్ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో
Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్లో నితీశ్ పార్టీకి ముగింపేనా!