న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో వెల్లడించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొన్నది. ఈ అంశాన్ని కోర్టు సెలవుల అనంతరం మరొకరోజు విచారిస్తామంటూ వాయిదా వేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం.. ఈ దశలో ఎలాంటి ఉపశమనం కలిగించలేమని తెలిపింది. ఇప్పటికే ఐదు దశలు ముగిసి, ఇంకా రెండు దఫాల పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈసీకి ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేమని పేర్కొన్నది.
ఓటరు శాతాల వెల్లడికి ఈసీని ఆదేశించలేం.. ఏడీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు
ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో వెల్లడించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొన్నది

Latest News
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
లెన్స్కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు గ్రీన్ సిగ్నల్!
ఇప్పుడు నీ తోలు తీయాలా రేవంత్ రెడ్డి? : హరీశ్ రావు
ఏప్రిల్ 22 దాకా తెలంగాణలో విచిత్ర వాతావరణం : రోజూ ఎండలు, వానలు
బీచ్ లో ఆలల చెంత సింహం..ఫోటో, వీడియో వైరల్
హాట్ టాపిక్...గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
కోర్టు ధిక్కరణ.. అత్తాపూర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష
శ్రీరాముడిపై వ్యాఖ్యలు..ప్రకాశ్రాజ్ వివరణ !