విధాత, హైదరాబాద్ : సెల్ఫీ సరదాలు ప్రాణాలను బలిగొంటున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నప్పటికి యువత దీని మోజు నుంచి బయటపడటం లేదు. తాజాగా ఓ యువతి లోయ అంచు వద్ద సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి జారీ పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
పూణేలోని వార్జేకు చెందిన 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ స్నేహితులతో కలిసి మహారాష్ట్ర సాతారా జిల్లాలోని థోస్గఢ్ జలపాతాన్ని సందర్శించారు. అనంతరం అమీర్ ఖురేషీ,బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జారిపోయింది. ప్రమాదవశాత్తు జారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసింది. సమీపంలోనే ఉన్న రెస్క్యూ సిబ్బంది గమనించి ఆమెను తాడు సహాయంతో లోయలోనుంచి సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. గాయాలకు గురైన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి సెల్ఫీ సరదా ప్రహాసనం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రాణం మీదకు తీసుకొచ్చిన సెల్ఫీ సరదా
సెల్ఫీ సరదాలు ప్రాణాలను బలిగొంటున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నప్పటికి యువత దీని మోజు నుంచి బయటపడటం లేదు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు