హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జలగం వెంగలరావు పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండీ పప్పీ దత్తత మేళా ” ను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు. డీ–వార్మ్ చేసిన, వ్యాక్సిన్ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రజలు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలి దత్తతగా కూకట్పల్లి కి చెందిన సి.హెచ్. సాయికి ఒక కుక్కపిల్లను స్వయంగా కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఆకట్టుకుంది.
కమిషనర్ ఆర్.వి. కర్ణన్ : దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన “ఇండీ పప్పీ దత్తత మేళా”లో 24 దేశీ కుక్కపిల్లలు దత్తతకు వెళ్లాయి.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత