హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జలగం వెంగలరావు పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండీ పప్పీ దత్తత మేళా ” ను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు. డీ–వార్మ్ చేసిన, వ్యాక్సిన్ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రజలు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలి దత్తతగా కూకట్పల్లి కి చెందిన సి.హెచ్. సాయికి ఒక కుక్కపిల్లను స్వయంగా కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఆకట్టుకుంది.
కమిషనర్ ఆర్.వి. కర్ణన్ : దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన “ఇండీ పప్పీ దత్తత మేళా”లో 24 దేశీ కుక్కపిల్లలు దత్తతకు వెళ్లాయి.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు