హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జలగం వెంగలరావు పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండీ పప్పీ దత్తత మేళా ” ను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు. డీ–వార్మ్ చేసిన, వ్యాక్సిన్ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రజలు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలి దత్తతగా కూకట్పల్లి కి చెందిన సి.హెచ్. సాయికి ఒక కుక్కపిల్లను స్వయంగా కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఆకట్టుకుంది.
కమిషనర్ ఆర్.వి. కర్ణన్ : దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన “ఇండీ పప్పీ దత్తత మేళా”లో 24 దేశీ కుక్కపిల్లలు దత్తతకు వెళ్లాయి.

Latest News
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి