హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జలగం వెంగలరావు పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండీ పప్పీ దత్తత మేళా ” ను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు. డీ–వార్మ్ చేసిన, వ్యాక్సిన్ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రజలు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలి దత్తతగా కూకట్పల్లి కి చెందిన సి.హెచ్. సాయికి ఒక కుక్కపిల్లను స్వయంగా కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఆకట్టుకుంది.
కమిషనర్ ఆర్.వి. కర్ణన్ : దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన “ఇండీ పప్పీ దత్తత మేళా”లో 24 దేశీ కుక్కపిల్లలు దత్తతకు వెళ్లాయి.

Latest News
గొప్ప వీడ్కోలు ఇవ్వాలని అనుకున్నాం..
17 ఏళ్ళ అమ్మాయితో స్టార్ హీరో డేటింగ్
అయోధ్య.. ఆ 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం నిషేధం..!
మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ రివ్యూ..
ఈ నాలుగు రాశుల వారికి అప్పు ఇస్తున్నారా..? జన్మలో కూడా తిరిగి వసూలు చేయలేరట..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో వివాదాలు.. జర జాగ్రత్త..!
బాబోయ్.. రెడ్ డ్రెస్ లో పచ్చళ్ల పాప అరాచకం.. రమ్య మోక్ష అందాల అలజడి
పట్టు చీరలో అనసూయ క్యూట్ లేటెస్ట్ ఫొటోలు
బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా..? ఈ ఎత్తైన భవనం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.
చరిత్రలో మైలు రాయిగా మేడారం ప్రాంగణ పునరుద్ధరణ