మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం

విధాత:మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడు కు చెందినది గా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగలటంతో మంటలు చెలరేగాయి. టైర్ సమీపంలోని ఆయిల్ ట్యాంక్ కు మంటలు వ్యాపించడం తో మరింత వేగంగా మంటలు వ్యాపించటంతో కూడి, ఎడమ వైపుల ఉన్న […]

  • Publish Date - June 11, 2021 / 01:20 AM IST

విధాత:మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడు కు చెందినది గా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగలటంతో మంటలు చెలరేగాయి. టైర్ సమీపంలోని ఆయిల్ ట్యాంక్ కు మంటలు వ్యాపించడం తో మరింత వేగంగా మంటలు వ్యాపించటంతో కూడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ ఫీ తీసుకునే బాక్స్ లు మంటలకు ఆహుతైయ్యాయి.

లాక్ డౌన్ సభయం కావటంతో పెను ప్రమాదం జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని మంటలను అదుపులోకి తీసుకొని వస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం కు ప్రధాన కారణం కేవలం లారీ టైరు పేలటమే అని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిపై రూరల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.