విధాత : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ సీనియర్ నేతలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, చల్లా వంశీ చంద్ రెడ్డిలు సైతం సీడబ్ల్యుసీ భేటీకి హాజరుకానున్నారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశముందని తెలుస్తుంది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది సీట్లకే పరిమితమైన తీరు..బీఆరెస్ పతనం..బీజేపీ పుంజుకోవడం వంటి పరిణామాలపై కూడా ఢిల్లీ పార్టీ పెద్దలకు రేవంత్ బృందం వివరించవచ్చని సమాచారం.
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి శనివారం.. సీడబ్ల్యుసీ భేటీకి హాజరు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు