విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్వాహణ భాగస్వామిగా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో నాసిరకం పదార్థాలను గుర్తించి హోటల్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు హోటల్లో జూలై 8వ తేదీన తనిఖీ చేశారు. “చిట్టి ముత్యాలు బియ్యం (25 కిలోలు) 2022 నాటికి డేట్ అయిపోయిన బ్యాగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్ 500 గ్రాముల కొబ్బరి తురుము కనుగొనబడింది. స్టీల్ కంటైనర్ లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు, పాక్షికంగా తయారు చేసిన ఆహారాలకు సైతం మూతలు లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయని, వంటగది ఆవరణలోని కాలువలలో మురికి నీరు ఉందని, ఆహార తయారీలో ఉపయోగించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గమనించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.
SANDEEP KISHAN | హీరో సందీప్ కిషన్ హోటల్పై కేసు నమోదు
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్వాహణ భాగస్వామిగా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో నాసిరకం పదార్థాలను గుర్తించి హోటల్పై కేసు కూడా నమోదు చేశారు.

Latest News
ఐపీఎల్ 2026 ఫైనల్కు బెంగళూరు.. గుజరాత్పై ఘనవిజయం
రూ.12వేలలోపే 5G మొబైల్ లాంచ్ చేసిన లావా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
AI దెబ్బకు ఫోన్ల ధరలు పెరుగుతాయా? మొదలైన కొత్త టెన్షన్ !
భారీ వంతెనలు, టన్నెల్స్తో అద్భుతమైన రహదారి.. విశాఖ-రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా ఉందో చూశారా!
మోడలింగ్ గర్ల్స్ ఫొటోలు చూపించి.. మధ్యప్రదేశ్లో వెడ్డింగ్ స్కామ్.. 42 మంది పెళ్లి కొడుకులకు టోపీ
బండి భగీరథ్కు కోర్టు షాక్.. మూడు రోజుల పోలీసు కస్టడీ
‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల
క్రిమిలేయర్ నిబంధన ఎత్తి వేయాలి: ఆర్.కృష్ణయ్య
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ని కలిని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు
రూ.1000 కోట్ల భూ కుంభకోణం బయటపెట్టిన హరీష్ రావు