విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్వాహణ భాగస్వామిగా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో నాసిరకం పదార్థాలను గుర్తించి హోటల్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు హోటల్లో జూలై 8వ తేదీన తనిఖీ చేశారు. “చిట్టి ముత్యాలు బియ్యం (25 కిలోలు) 2022 నాటికి డేట్ అయిపోయిన బ్యాగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్ 500 గ్రాముల కొబ్బరి తురుము కనుగొనబడింది. స్టీల్ కంటైనర్ లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు, పాక్షికంగా తయారు చేసిన ఆహారాలకు సైతం మూతలు లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయని, వంటగది ఆవరణలోని కాలువలలో మురికి నీరు ఉందని, ఆహార తయారీలో ఉపయోగించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గమనించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.
SANDEEP KISHAN | హీరో సందీప్ కిషన్ హోటల్పై కేసు నమోదు
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్వాహణ భాగస్వామిగా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో నాసిరకం పదార్థాలను గుర్తించి హోటల్పై కేసు కూడా నమోదు చేశారు.

Latest News
మహా శివరాత్రితో ఈ ఆరు రాశులకు శని నుంచి ఉపశమనం..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు..!
తెలంగాణ షోరూమ్ రిజిష్ట్రేషన్లలో కొత్త వాహన యజమానులకు ఆర్టీఏ షాకింగ్ రూల్
నిద్రపోయిన యువతి మాయం : మంచంపై పాము కుబుసం ప్రత్యక్షం – యూపీలో 'నాగిని'?
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు : డీజీపీ శివధర్ రెడ్డి
దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న పబ్లిష్ కాని పుస్తకం.. ఇంతకీ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో ఏముంది..?
పట్టణ ఓటర్లా.. మజాకా!!
మెనోపాజ్, పెరిమెనోపాజ్.. వైద్యుల సహాయం ఏ సమయంలో అవసరం?
చందమామపై నగరం నిర్మిస్తే ఇలా ఉంటుంది.. వీడియో
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక వెబ్ నుంచి కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చు