విధాత హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఏఈఈలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి … మాజీ మంత్రి టి.హరీశ్రావు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Latest News
నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్
ఉద్యమకారుల గుర్తింపు ప్రత్యేక కమిటీ తొలి భేటీ
రాజస్థాన్ లో విరుచుకుపడిన ఇసుక తుపాను
షాకింగ్.. సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ టాప్
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
రూ.5,500కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా
Rashmika | రష్మికను సరదాగా ఆటపట్టించిన షాహిద్ కపూర్.. వైరల్ అవుతున్న స్టార్ జంట కెమిస్ట్రీ!
చార్ ధామ్ యాత్ర ఘాట్ రోడ్డుల్లో ట్రాఫిక్ జామ్..వీడియో వైరల్
ఐటీ మేనేజర్ జాబ్ వదిలేసింది..ఆటో డ్రైవర్ గా మారింది!