విధాత హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఏఈఈలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి … మాజీ మంత్రి టి.హరీశ్రావు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Latest News
కత్తితో పొత్తికడుపు కోసుకున్న గర్భిణి.. నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు జన్మ
ధనలక్ష్మి కటాక్షం కోసం శుక్రవారం సాయంత్రం చేయండిలా..!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
భారత్లో కృత్రిమ మేధ విప్లవానికి రూ.10 లక్షల కోట్లు : రిలయెన్స్ జియో
ఓర చూపులతో వల వేస్తున్న నేహా శర్మ
చార్మినార్ వద్ద పరిచయం.. చెంగిచర్లలో దారుణం
పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న పూజా హెగ్డే
కుప్పకూలిన స్టాక్మార్కెట్ – ఏంటి కారణం?
మావోయిస్టు చీఫ్ దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్ట ఆపరేషన్?
92 అడుగుల పొడవున్న భారీ డైనోసార్.. చైనాలో వెలుగు చూసిన టోంగ్నాన్లాంగ్ అవశేషాలు