Stock Market Crash | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల దెబ్బ.. స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం – ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 1,200 పాయింట్లు కూలింది. నిఫ్టీ 25,500 కంటే దిగువకు పడిపోయింది. పెట్టుబడిదారుల 7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

Sensex crashes 1200 points as Nifty falls below 25500 amid US Iran tensions

Sensex Crashes Amid US–Iran Tensions; ₹7.5 Lakh Crore Wiped Out

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల దెబ్బ.. 1,200 పాయింట్లు కూలిన సెన్సెక్స్

అమెరికా – ఇరాన్​ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల ఎగబాకడం, లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1,236 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,500 దిగువకు జారింది. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సుమారు రూ.7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

 

విధాత బిజినెస్​ డెస్క్​ |19 ఫిబ్రవరి 2026 |  హైదరాబాద్​:

Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం భారీ షాక్ తగిలింది. ప్రారంభంలో లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్, మధ్యాహ్నానికి పూర్తిగా మలుపుతిరిగింది. భారీ విక్రయాలు చోటుచేసుకోవడంతో BSE Sensex 1,236 పాయింట్లు (1.48%) పతనమై 82,498 వద్ద ముగిసింది. Nifty 50 365 పాయింట్లు (1.41%) పడిపోయి 25,454 వద్ద నిలిచింది.

గత మూడు రోజులుగా కొనసాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడి, ఒక్కరోజులోనే దాదాపు రూ.7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. రియాల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్ – ఇలా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చిన్న, మధ్య తరహా షేర్లు కూడా 1 నుంచి 1.5శాతం వరకు పడిపోయాయి. ప్రారంభ లాభాలు నిలబడకపోవడం, అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్‌ను కుదిపేసింది.

మెరికా – ఇరాన్​ ఉద్రిక్తతలు : కాశానికి ఎగబాకిన ముడి చమురు

మార్కెట్ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులపై ఆందోళనలు పెరగడంతో క్రూడ్ ఆయిల్​ ధరలు ఈ ఏడాది గరిష్టానికి చేరాయి.

భారత్ ముడి చమురులో సుమారు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. చమురు ధరలు పెరగడం అంటే ద్రవ్యోల్బణ భయం, వడ్డీ రేట్లపై అనిశ్చితి. ఇదే పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారి తీసింది.

అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నివేదికలు వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ అవర్షన్‌ను పెంచింది. డాలర్ బలపడటం, రూపాయి బలహీనత కూడా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

 లాభాల స్వీకరణభారీ షేర్లపై ఒత్తిడి

ఇటీవల మూడు రోజుల ర్యాలీ తర్వాత ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడం కూడా ఈ పతనానికి కారణమైంది. ఒకసారి అమ్మకాలు వేగం అందుకుంటే ఆటోమేటిక్, టెక్నికల్ విక్రయాలు కూడా పెరుగుతాయి.

ప్రధాన ఇండెక్స్ షేర్లలో Reliance Industries, HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank, Larsen & Toubro వంటి భారీ కంపెనీలు పడిపోవడం సూచీలపై అదనపు ఒత్తిడి తెచ్చింది. అదనంగా ఆసియా మార్కెట్లలో లూనార్ న్యూ ఇయర్ సెలవులు ఉండటం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) భాగస్వామ్యం తగ్గింది. బ్యాంకింగ్ హాలీడే కారణంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా తగ్గాయి. తక్కువ లిక్విడిటీ ఉన్నప్పుడు మార్కెట్ హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి.

టెక్నికల్‌గా నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వైపు కదులుతోంది. 25,300–25,000 స్థాయి కీలకం. ఈ స్థాయిలు నిలబడితే స్థిరీకరణకు అవకాశం ఉంది. లేదంటే తాత్కాలిక అస్థిరత కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న పతనం నిర్మాణాత్మక సమస్యల వల్ల కాదని, యుద్ధ భయాలు, లాభాల స్వీకరణ కలయికగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest News