విధాత:జస్టిస్ కేశవరావు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
జస్టిస్ కేశవరావు మృతి న్యాయ వ్యవస్థ కు, అణగారిన వర్గాలకు తీరని లోటు అని ఆయన అన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచి కేశవరావు తనకు ఆప్తుడు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.