విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు ప్రభాకర్కు సమన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకుని ఒకరికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపణలు చేవారు. తనపై ప్రభాకర్ అసత్య ఆరోపణలు చేశారంటూ మున్షీ నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ప్రభాకర్కు నోటీసులు జారీ చేసింది.
Dipadas Munshi | బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు కోర్టు నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది

Latest News
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం
నెట్ఫ్లిక్స్లో కొత్త సినిమాల పండగ..
ఓటీటీలో.. కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ సంచలనం
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రగ్యా జైస్వాల్ ట్రెండీ లుక్స్ అదుర్స్.. ఫొటోలు