విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు ప్రభాకర్కు సమన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకుని ఒకరికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపణలు చేవారు. తనపై ప్రభాకర్ అసత్య ఆరోపణలు చేశారంటూ మున్షీ నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ప్రభాకర్కు నోటీసులు జారీ చేసింది.
Dipadas Munshi | బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు కోర్టు నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది

Latest News
ఎంపీ మల్లు రవి భార్య భూమికి ఎన్వోసీ
వామ్మో... ఏఐ గ్లాసెస్తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్రూమ్ యాక్టివిటీ కూడా చూసేస్తారు!
రంగోలి చీరలో అనసూయ ఖతర్నాక్ ఫోటోలు
అభివృద్దికి ఇప్పుడు సంతానోత్పత్తి కీలకం : ఏపీ సీఎం చంద్రబాబు
అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం
వారసులను దించేస్తున్నారు !.. హీట్ పెంచుతున్న ఖర్చీప్ కల్చర్!!
మూసీ పేరుతో లూటీకి సీఎం రేవంత్ ప్లాన్ : కేటీఆర్
శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట
టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్...టాప్ త్రీలో ఏపీ !
అడవుల నుంచి ఢిల్లీ దాకా… మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రస్థానం