విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ ద్వారా ఫైర్ సర్వీసెస్ వీక్(అగ్నిమాపక వారోత్సవాలు) ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబడుతుందని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ ఫైర్ సర్వీసెస్ వీక్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్నిప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీబీ కాశిరెడ్డి, హయత్ నగర్, ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు
నేటీ నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.. రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ ద్వారా ఫైర్ సర్వీసెస్ వీక్(అగ్నిమాపక వారోత్సవాలు) ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు

Latest News
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!