విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్ సాగర్ జలాశయం గోదావరి జలాలతో నిండుకుంటున్న జల దృశ్యం చూసి నా మనసు పులకరించిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులకు నీరందించాలనే నిత్య తపనకు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. అన్నదాతల ఆనందమే, వారి ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా బీఆరెస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. ఈ జలదృశ్యాన్ని చూస్తుంటే మనసు పులకరించిపోతోందని హరీశ్రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయని, దిగువన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా నందిమేడారంలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, శనివారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలిపోతున్నాయి. ఇక్కడ కూడా ఒకే మోటర్ నడిపిస్తున్నారు. మొత్తం 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 13 టీఎంసీలకుపైగా జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు జలాశయంలో 27.54 టీఎంసీల నీటి సామర్థ్యానికిగాను ప్రస్తుతం 17.06 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడ పంప్హౌస్లో రెండు బాహుబలి మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి చేరుకుంటున్నాయి.
T. Harish Rao | రంగనాయక్ సాగర్ జల సోయగంతో పులకరించాను : మాజీ మంత్రి టి.హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్ సాగర్ జలాశయం గోదావరి జలాలతో నిండుకుంటున్న జల దృశ్యం చూసి నా మనసు పులకరించిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు.

Latest News
ఉద్యోగం రాక అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య
షావోమీ సివి సిరీస్ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్కు వస్తాయా?
ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు భూములు కావాలి : టీజీ రెడ్కో
హైదరాబాద్లో రేపు నీళ్లు బంద్.. జాగ్రత్త! నిల్వ చేసుకోండి
నన్ను చదువుకోమంటే.. మీ స్కూల్ కూల్చేస్తా.. టీచర్కే వార్నింగ్ ఇచ్చిన పిల్లాడు..!
రైతు సదస్సుకు ముందే బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సవాళ్లు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులదే తుది నిర్ణయం.. బకాయిలు గత సర్కార్ పాపం..
TG Organics యాప్ : రైతుకు ఆనందం – వినియోగదారుడికి ఆరోగ్యం
వాహనదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి టోల్ ప్లాజాలు ఉండవు.. ప్రయాణించిన దూరానికే చార్జ్