విధాత, హైదరాబాద్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన బండ్ల జూలై 6న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే తాజాగా ఆయన అసెంబ్లీ హాల్లో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలవడంతో ఆయన మళ్లీ బీఆరెస్లో చేరుతారన్న కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బండ్ల నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం తన పార్టీ మార్పు కథనాలను కొట్టేసిన బండ్ల తాను కాంగ్రెస్లో కొనసాగనున్నట్లుగా ప్రకటించారు. ఈ రోజు బండ్లను వెంట తీసుకుని మంత్రి జూపల్లి సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. బండ్ల వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు.
Bandla Krishnamohan Reddy | సీఎం రేవంత్రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల
ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు

Latest News
అండర్-19 వరల్డ్ కప్లో భారత్ టార్గెట్ 136
రేపు రథసప్తమి... ఇలా చేస్తే శుభ ఫలితాలు
సమోసా నుంచి కిచిడీ వరకూ.. దావోస్ సదస్సులో ప్రపంచ నాయకులను ఆకర్షించిన ఇండియన్ ఫుడ్
బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్
ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్
‘రాజాసాబ్’ భారీ అంచనాలకి బ్రేక్…
నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత
మున్సిపోల్స్ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!