విధాత, హైదరాబాద్ : | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మత్తడి మీదుగా వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతుంది. సాగర్ జల సోయగాలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్) 514.75 మీటర్లుకాగా ప్రస్తుతం 513.23 మీటర్ల నీటి మట్టం నమోదైంది. వరద ప్రవాహం పెరిగితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
HYDERABAD | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్
తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది.

Latest News
ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ