విధాత, వరంగల్ ప్రతినిధి:కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. యోగి రెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండ తన కార్యాలయంలో కూతురుతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలకు శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యోగి రెడ్డి, ఆయన కూతురు ఆధ్య (10) మృత దేహాలను హనుమకొండలోని ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం నుండి ప్రెస్ క్లబ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి జర్నలిస్టు యోగి రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగి రెడ్డి, ఆద్య మృతదేహాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా అంత్యక్రియల కోసం జనగామకు తరలించారు. జర్నలిస్టులతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Journalist Yogi Reddy | యోగిరెడ్డికి జర్నలిస్టుల కన్నీటి నివాళి.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు
కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.

Latest News
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం