విధాత, హైదరాబాద్ : చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహారశైలీపై అభ్యంతరం తెలుపుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ చంద్రచూడ్ విచారించారు. కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి విచారణ అంశాలపై ప్రెస్మీట్ పెట్టడాన్ని తప్పుబడుతూ నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. అదే సమయంలో కమిషన్ విచారణ కొనసాగించుకోవచ్చని సీజేఐ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. దీంతో నరసింహారెడ్డి స్వచ్చందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో నియామితులైన జస్టిస్ మధన్ బీ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
TELANGANA | విద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ … ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు.

Latest News
హైదరాబాద్ ప్రజలకు మరో రిలీఫ్.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్
గ్రౌండ్ యాక్షన్లోకి ‘బొద్దింకలు’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోరుతూ ఢిల్లీలో నిరసన
రాజేశ్ ఎక్స్పోర్ట్స్తో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం
ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి కీలక భేటీ
ఫోన్ ట్యాపింగ్ తో తెలంగాణ వాసుల స్వేచ్ఛను హరించారు: ఎంపీ చామల
Janhvi Kapoor | ‘పెద్ది’లో అచ్చియమ్మ పేరు వెనుక ఉన్న భావోద్వేగ కథ ఇదే.. బుచ్చిబాబు మనసును గెలుచుకున్న మహిళ ఎవరు?
హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది.. హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
మా పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలకే..బాబాపూర్ గ్రామస్తుల తీర్మానం
మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత!