విధాత, హైదరాబాద్ : చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహారశైలీపై అభ్యంతరం తెలుపుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ చంద్రచూడ్ విచారించారు. కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి విచారణ అంశాలపై ప్రెస్మీట్ పెట్టడాన్ని తప్పుబడుతూ నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. అదే సమయంలో కమిషన్ విచారణ కొనసాగించుకోవచ్చని సీజేఐ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. దీంతో నరసింహారెడ్డి స్వచ్చందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో నియామితులైన జస్టిస్ మధన్ బీ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
TELANGANA | విద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ … ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు.

Latest News
అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!