విధాత, హైదరాబాద్ : చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహారశైలీపై అభ్యంతరం తెలుపుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ చంద్రచూడ్ విచారించారు. కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి విచారణ అంశాలపై ప్రెస్మీట్ పెట్టడాన్ని తప్పుబడుతూ నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. అదే సమయంలో కమిషన్ విచారణ కొనసాగించుకోవచ్చని సీజేఐ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. దీంతో నరసింహారెడ్డి స్వచ్చందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో నియామితులైన జస్టిస్ మధన్ బీ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
TELANGANA | విద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ … ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
చత్తీస్ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు.

Latest News
దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు…
చిరంజీవి – బాబీ సినిమా(మెగా158)కు "నిర్మాత, ముఖ్య నటీనటులు" కావలెను
జోరుగా సాగుతున్న విజయ్-రష్మిక పెళ్లి ఏర్పాట్లు..
వన్ రూపీ డాక్టర్..! ఆ మూడు టెస్టులు కూడా ఒక్క రూపాయికే..!!
భార్య సురేఖకు మెగాస్టార్ ప్రేమ సందేశం..
గద్వాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఇది బాహుబలి బెండకాయ.. చూస్తే మతి పోవాల్సిందే..!
టీజీ ఎప్సెట్ దరఖాస్తులు.. ఉదయం 11.30 నుంచి ఆన్లైన్లో స్వీకరణ
నూతన విద్యా విధానం రద్దు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ మహాసభలో డిమాండ్
నేడు ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు.. ఈ ఐదు రాశుల వారికి ధన ప్రవాహమే..!